Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Advertiesment
Gaddaar Award function Function

దేవీ

, మంగళవారం, 17 జూన్ 2025 (10:18 IST)
Gaddaar Award function Function
ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డులో కొందరు హాజరైనా పూర్తిస్థాయిలో ప్రముఖ హీరోలు హాజరుకాలేకపోయారు. అందుకు కారకులెరు? తప్పిదం ఎవరిది? దిల్ రాజు అట్టర్ ప్లాప్… స్టార్లను రప్పించడంలో ఘోర వైఫల్యం అంటూ ఫిలింనగర్ లో కథనాలు, సోషల్ మీడియాలో కూడా తెలంగాణ సినిమా కార్మికులు విమర్శిస్తున్నారు. అందుకు తగినట్లే దిల్ రాజు మాట్లాడుతూ, అవార్డ్ సక్సెస్ చేశాం. కానీ కొంత లోపం జరిగిందంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. 
 
ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తున్నాయంటే సినిమా పరిశ్రమలోని అందరూ బాధ్యతగా స్వీకరించాలి. షూటింగ్‌లతో బిజీగా ఉన్నా, ఎక్కడా ఉన్నా ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చిందంటే ఏ రాష్ట్రమైనా  ఆ వేడుకకు వచ్చి  అవార్డ్‌ తీసుకోవాలి. భవిష్యత్‌లో ఎప్పుడైనా ప్రభుత్వం నుంచి అవార్డ్‌ వస్తే స్వీకరించాలి. ఇది నా రిక్వెస్ట్‌. ఇక  ఇంత పెద్ద వేడుకలో చిన్న చిన్న కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వల్ల ఏమైనా తప్పులు జరిగి ఉంటే, వాళ్లు బాధపడి ఉంటే  వాళ్లకు ఎఫ్‌డీసీ తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను. ఈవెంట్‌ అయిన తరువాత అందరూ అప్రిషియేట్‌ చేశారు, ప్రభుత్వం నుంచి రిపోర్ట్స్‌, బయటి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ చాలా పాజిటివ్‌గా ఉంది' అన్నారు. 
 
తెలంగాణ సినిమాకు అన్యాయం జరిగిందా?
ప్రైవేట్ వేడులకు స్టార్లు క్యూకడితే -  ప్రభుత్వం వేడుకకు మొహం చాటేశారా? అనేది కూడా చర్చ జరుగుతోంది. ఈ ఫంక్షన్ కు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, బ్రహ్మానందం సహా అనేకమంది హాజరు కాకపోవడం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. వారిని రప్పించడంలో దిల్ రాజు విఫలమైనట్టు ప్రభుత్వ వర్గాలు మండిపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను రప్పించడంలోనూ దిల్ రాజు ఫెయిలయ్యారు. అనేకమంది హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పటికీ వారిని కూడా రప్పించడంలో ఫెయిల్ అయ్యారు. ఆయన పిలిస్తే రాని వారు ఎవరు అని అనేకమంది నిలదీస్తున్నారు.  అసలు తెలంగాణ యాస, భాష, సంస్క్రుతిపై తీసిన చాలా సినిమాలు అవార్డుకు నోచుకోలేకపోవడం ఒకకారణంగా, ఎక్కువ భాగం ఆంధ్ర సినిమాలకే దక్కడం కూడా పలు విమర్శలకు తావు ఇచ్చింది.
 
అసలు కారణాలు ఇవేనా?
అసలు అవార్డుల ఎంపిక పారిదర్శకంగా వుందని దిల్ రాజు చెప్పినా, కమిటీలో ఆంధ్ర కు చెందిన పాతతరం వారు వుండడం, రిటైర్ మెంట్ అయిన వారు స్కూటినీ కమిటీలో వుండడం విమర్శలకు తెరలేపింది. తెలంగాణ సెపరేట్ అయ్యాక ఆంద్ర నిర్మాతలు, హీరోలపై మొదట్లో పెద్ద ఎత్తున నిరసలు వచ్చాయి. అందరూ తెలంగాణను వదిలేయాలని అప్పటి ప్రభుత్వంకు చెందిన అనుచరులు యాగీ చేసిన సందర్భాలున్నాయి. రామానాయుడు స్టూడియో, ఎఫ్.ఎన్.సి.సి, ఛాంబర్ కార్యాలయం వంటి వాటిల్లో తెలంగాణ విజయం తర్వాత అప్పటి నాయకులు మీటింగ్ లు పెట్టినప్పుడు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక్కడ వున్నవన్నీ మా ఆస్తులే. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. లేదా. ఇవన్నీ మాకు అప్పగించండి. అంటూ స్లోగన్స్ చేశారు. కానీ అప్పుడు కె.సి.ఆర్. కుటుంబీకులు వున్నా పెద్దగాఖండిచలేదు. ఆ సమయంలో కోదండరామ్ ఒక్కరే ముందుకు వచ్చి వారిని నియంత్రించారు. ఆ తర్వాత నాయకులు సైక చేయడంతో నినాదాలు ఆగిపోయాయి. 
 
ఇలాంటివి ఇంకా తెలుగు చిత్ర పరిశ్రమ మర్చిపోలేదు. సినిమాల్లో తమకూ పనులు కాావాలనీ, యాభై నిష్పత్తితో సినిమాలు పనిచేయించే రూల్ రావాలని తెరపైకి తీసుకువచ్చారు. కొద్దిరోజులు అది సాద్యపడింది.కానీ కాలక్రమేణా అది మరుగుపడిపోయింది. ఇక రేవంత్ రెడ్డి వచ్చినా ఆయన మీకు భరోసా అంటూ ఏమీ ఇవ్వలేదు. పైకి మాత్రం మీ వెంటనే నేను అన్నారు. కానీ ఎర్రచందనం స్మగ్లర్, విలన్ లు హీరోయిజం చూపే సినిమాలకు అవార్డులు ఇవ్వడం విమర్శలకు తావు ఇచ్చింది. ఇలా ఎన్నో విమర్శలున్నా.. 14 ఏళ్ళ వరకు రాని అవార్డులు రావడం ఒక్కటే కొసమెరుపుగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్