ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా నటించిన సినిమా కుబేర. నిన్న రాత్రి హైదరాబాద్ లో ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు ధనుష్ తెలివిగా సమాధానమిచ్చారు. ధనుష్ మీరు తెలుగులో డైరెక్ట్ చేస్తే ఏ హీరోతో చేస్తారు? అన్న ప్రశ్నకు తడుముకోకుండా పవన్ కళ్యాణ్ అని చెప్పారు. ఇక ఈ సమాధానంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇక్కడే ఓ ఆశక్తికర సన్నివేశం కూడా వుంది. అంతకుముందే నాగార్జున మాట్లాడుతూ, ధనుష్ దర్శకత్వంలో నేను నటించాలనుందని అన్నారు.
అయితే, ధనుష్ పక్కనే కూర్చున్న నాగార్జున మాత్రం, పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాననగానే పెద్దగా రియాక్షన్ కనిపించలేదు. ఇక ధనుష్ అన్నమాటలు ఇప్పుడు వైరల్ గా మారడం అనేది కామనే. ఎవరు హైదరాబాద్ వచ్చినా, ఒక వేళ ఆంధ్రప్రదేశ్ వెళ్ళినా, ఉప ముఖ్యమంత్రి హోదాలో వున్న పవన్ గురించి మాట్లాడడం మామూలే. ఆయన పేరు చెబితే ఒకరకంగా సినిమాపరంగా పబ్లిసిటీ కూడా అవుతుంది. అది మరింత ఉపయోగపడుతుందని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఒకవేళ ధనుష్ దర్శకత్వం వహించాలన్నా.. పవన్ కూడా తీరిక చేసుకోవాలి. ఇప్పుడు ఆ పరిస్థితి పవన్ కు లేదు. ఇదంతా కేవలం కుబేర పబ్లిసిటీకి బాగా ఉపయోగపడుతుందని తెలుస్తోంది.