'ప్రిన్స్' మహేష్తో దిల్రాజు ముందుకు వచ్చాడు!
'ప్రిన్స్' మహేశ్ బాబు సినిమాను రిలీజ్ చేయడానికి దిల్రాజు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు.. మురుగదాస్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. కాగా, తదుపరి
'ప్రిన్స్' మహేశ్ బాబు సినిమాను రిలీజ్ చేయడానికి దిల్రాజు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు.. మురుగదాస్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. కాగా, తదుపరి చిత్రం కొరటాల శివ, ఆ తర్వాత వంశీ పైడిపల్లితో మహేశ్ ఒక సినిమా చేయనున్నాడు.
అయితే ఈ సినిమా పీవీపీ బ్యానర్లో తెరకెక్కుతుందని మొదట్లో ప్రకటించారు. అయితే మహేశ్ ఇప్పుడు ఈ ప్రాజెక్టును దిల్ రాజు చేతిలో పెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మహేశ్ నటించిన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాకి దిల్ రాజు నిర్మాత. ఆ కాంబినేషన్తో దిల్రాజు పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.