Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఛార్మి రమ్మంది.. రామ్ ఒకేనన్నాడు.. ఎక్కడికి.. ఎందుకు?

ఛార్మి రమ్మంది.. రామ్ ఒకేనన్నాడు.. ఎక్కడికి.. ఎందుకు?
, శుక్రవారం, 2 ఆగస్టు 2019 (19:22 IST)
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో డబుల్ ధిమాక్ హైదరాబాదీగా రామ్ నటించిన విషయం తెలిసిందే. అయినా ఈ సినిమా ఆడుతుందా అని ఎన్నో డౌట్లు. రిలీజ్ తరువాత బోలెడంత ప్రాఫిట్. ఇక్కడే తన ధిమాక్‌కు పదును పెట్టాడు ఇస్మార్ట్ శంకర్. ఇప్పుడు ప్రాఫిట్లో తనకు షేర్ కావాలని పూరిని టెన్షన్ పెడుతున్నాడట రామ్.
 
ఇస్మార్ట్ శంకర్‌తో తాను కూడా స్మార్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు రామ్. సినిమా భారీ హిట్ సాధించడంతో కొంత వాటా డిమాండ్ చేస్తున్నాడట రామ్. ఎందుకంటే సినిమా చేసేటప్పుడు రామ్ చాలా తక్కువ పారితోషికం తీసుకున్నాడట. సినిమా రిలీజ్ అయిన తరువాత చూసుకుందామని పూరికి చెప్పాడట.
 
అయితే ఇప్పుడు సినిమా మంచి లాభాలతో వెళుతోంది కాబట్టి పూరిని రిక్వెస్ట్ చేశాడట రామ్. నేను సగం అమౌంట్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి. మిగిలిన డబ్బులు ఇవ్వమని కోరాడట. అయితే పూరి జగన్నాథ్ అందుకు ఒప్పుకోకుండా డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా చేద్దామని.. అప్పుడు నీకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పాడట. ఈ ఒప్పందానికి రామ్ ఒకే చెప్పేశాడట. రామ్‌ను రెండో సినిమాకు ఒప్పించింది కూడా ఛార్మియేనట. రామ్.. ఛార్మి కూర్చుని ఈ ప్రాజెక్టును ఒకే చేసినట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ రికార్డ్‌ని బ్రేక్ చేసిన నాగ్... ఇంత‌కీ ఏంటా రికార్డ్..?