Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండు సినిమాలతోనే పీకల్లోతు ప్రేమలో యువ హీరో, హీరోయిన్?

Advertiesment
Saidharam Tej
, గురువారం, 7 నవంబరు 2019 (21:15 IST)
సుప్రీం సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా పెర్ఫార్మెన్స్ సూపర్ అంటూ ప్రేక్షకులు బాగా మెచ్చుకున్నారు. వీరి కాంబినేషన్ అదుర్స్ అన్నవారు లేకపోలేదు. అందుకే వీరి కాంబినేషన్లో దర్సకుడు మారుతి మరో సినిమాకు శ్రీకారం చుట్టారు.
 
ప్రస్తుతం వేగంగా ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రతిరోజు పండుగ సినిమా డిసెంబర్ 20వ తేదీ విడుదల కాబోతోంది. అయితే ఆ సినిమా రిలీజ్ కంటేముందు ఆ ఇద్దరు హీరోహీరోయిన్లు పీకల్లోతు ప్రేమలో పడ్డారంటూ ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోందట.
 
సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నాలు ప్రస్తుతం ప్రేమలో ఉన్నారట. సుప్రీం సినిమాతోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందట. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో వీరి ప్రేమ కాస్తా బాగా బలపడిందట. సాయిధరమ్ తేజ్ మెగా ఫ్యామిలీ హీరో కావడంతో అతడిని పెళ్ళి చేసుకునేందుకు రాశీ ఖన్నాకు ఎలాంటి అభ్యంతరం లేదంట. ఐతే సినిమా యాక్టర్స్ కదా.. ప్రేమ మధ్యలో ఆగిపోయే అవకాశం లేకపోలేదంటున్నారు అభిమానులు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ర‌వితేజ సినిమాలో న‌టిస్తున్న త‌మిళ న‌టుడు ఎవ‌రు..?