Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శింబు సరసన దేవసేన.. ఏ సినిమాలో తెలుసా?

శింబు సరసన దేవసేన నటిస్తోందా.. ఇదేంటి? అనుకుంటున్నారు కదూ.. అవునండి. గతంలో వచ్చిన ''ఏ మాయ చేసావే'' (తమిళంలో విన్నై తాండి వరువాయా) చిత్రానికి ప్రస్తుతం తమిళంలో సీక్వెల్ చేస్తున్నారు. శింబు హీరోగా గౌతమ్

శింబు సరసన దేవసేన.. ఏ సినిమాలో తెలుసా?
, గురువారం, 9 ఆగస్టు 2018 (14:29 IST)
శింబు సరసన దేవసేన నటిస్తోందా.. ఇదేంటి? అనుకుంటున్నారు కదూ.. అవునండి. గతంలో వచ్చిన ''ఏ మాయ చేసావే'' (తమిళంలో విన్నై తాండి వరువాయా) చిత్రానికి ప్రస్తుతం తమిళంలో సీక్వెల్ చేస్తున్నారు. శింబు హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో అనుష్క కథానాయికగా నటిస్తుందని సమాచారం. 
 
ప్రస్తుతం శింబు మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక శింబు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విన్నై తాండి వరువాయా సీక్వెల్‌లో నటించనున్నాడు. ఏ మాయ చేసావే తమిళ సినిమా గౌతమ్ మేనన్, శింబు, త్రిష కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. 
 
ఇందులో శింబు సరసన అనుష్క శెట్టి నటించనుందని టాక్. ఇందుకోసం అనుష్కతో గౌతమ్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. తెలుగులోనూ ఈ సినిమాకు సీక్వెల్ వుంటుందని.. మాధవన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తారని, అనుష్క శింబు లవర్‌ పాత్రలో కనిపిస్తుందని టాక్ వస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీరియల్‌ తరహాలో సాగే నితిన్ "శ్రీనివాస కళ్యాణం"