Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లయి ఇద్దరు పిల్లలున్న అనసూయకు రూ.40 లక్షలు కావాలట.. నిర్మాతలేమంటున్నారు?

Advertiesment
పెళ్లయి ఇద్దరు పిల్లలున్న అనసూయకు రూ.40 లక్షలు కావాలట.. నిర్మాతలేమంటున్నారు?
, మంగళవారం, 17 మే 2016 (12:52 IST)
బుల్లితెర‌పై అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే పాపులారిటీ సంపాదించిన యాంక‌ర్ అన‌సూయ‌. 'జ‌బ‌ర్దస్త్' షోతో తెలుగు బుల్లితెర ప్రేక్షకుల‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస ఆఫర్లతో ముందుకు దూసుకెళుతుంది. రెండు సినిమాలు భారీ విజయం సాధించడంతో అనసూయ రెమ్యూనరేషన్‌ని అమాంతంగా పెంచేసింది. నాగార్జున మూవీ 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంలో అనసూయ తన గ్లామర్‌తో కుర్రకారుని మత్తెక్కించింది. 
 
ఈ తర్వాత 'క్షణం' చిత్రంలో కీలకమైన పాత్రను పోషించింది. ఈ రెండు సినిమాల విజయాలతో మాంచి ఊపుమీదున్న అనసూయతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఇంటి ముందు క్యూ కడుతున్నారట. ఈ అవకాశాలను క్యాష్ చేసుకోడానికి ఈ యాంకరమ్మ రెడీ అవుతోందట. ఒక్క సినిమాలో న‌టించాలంటే రూ.40 ల‌క్ష‌ల‌కు ఒక్క రూపాయి కూడా త‌గ్గ‌డం కుదరదని ఈ అమ్మడు అంటోందట. దీంతో అన‌సూయ రేటు విన్న నిర్మాతలకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయట. 
 
బుల్లితెర మీద హాట్ హాట్ యాంక‌ర్‌గా పేరున్న ఈ అమ్మ‌డు ఉంటే సినిమాకు క్రేజ్ వ‌స్తుంద‌న్న ఉద్దేశంతో నిర్మాత‌లు ఆమె వెంట ప‌డుతుంటే ఆమె రేటు మాత్రం ఆకాశానికంటుతున్నాయి. పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మడికి నలభై లక్షలు ఇవ్వడం కంటే యంగ్‌ హీరోయిన్లు ఇరవై లక్షలకే వస్తుండటంతో దర్శకులు వారివైపు మొగ్గుచూపుతున్నారట. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే అవకాశాలు వస్తాయి… లేకపోతే టీవీషోలకే పరిమితం కావలసి వస్తుందని సినీ జనాలు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన 'అజర్' చిత్రం.. సంగీతా బిజ్లానీ అభ్యంతరం!