Publish Date: Sun, 18 Apr 2021 (09:57 IST)
Updated Date: Sun, 18 Apr 2021 (09:59 IST)
ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి... మరో యువతి ప్రేమలో పడి పీకల్లోతులో కూరుకునిపోయాడు. అదేసమయంలో పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువతి ఒత్తిడి చేయసాగింది. పైగా, ఈ విషయం భార్యకూ తెలిసింది. దీంతో ఏం చేయాలో అర్థంకాక... బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని సైదాబాద్లో జరిగింది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. రెయిన్ బజార్కు చెందిన దీపక్ కుమార్ (18) అనే యువకుడు హయత్ నగర్కు చెందిన యువతిని గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హయత్ నగర్లో ఉంటున్న అతడు ఇటీవల మరో యువతి ప్రేమలో నిండా మునిగాడు.
ఈ విషయం భార్యకు తెలియడంతో మనస్పర్థలు చెలరేగాయి. మరోవైపు, పెళ్లి చేసుకోవాలంటూ ప్రియురాలి నుంచి ఒత్తిడి పెరగడంతో తట్టుకోలేకపోయాడు. ఈ విషయాన్ని పలుమార్లు స్నేహితులకు చెప్పుకుని మథనపడ్డారు.
ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన దీపక్ కుమార్ తండ్రికి ఫోన్ చేసి ఎర్రకుంట సమీపంలోని పాడుబడిన బావిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు చెప్పాడు. అప్రమత్తమైన తండ్రి కరణ్లాల్ వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.
దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే దీపక్ కుమార్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.