Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆక్సిజన్ అంతా మీ గుప్పెట్లో పెట్టుకుని మమ్మల్ని అంటారేం? భాజపాపై మంత్రి ఈటెల బాణాలు

ఆక్సిజన్ అంతా మీ గుప్పెట్లో పెట్టుకుని మమ్మల్ని అంటారేం? భాజపాపై మంత్రి ఈటెల బాణాలు
, గురువారం, 29 ఏప్రియల్ 2021 (17:27 IST)
ఈ దారుణమైన కరోనా కష్టకాలంలో ప్రాణవాయువు అందక రోగులు చనిపోవడం దేశానికే అవమానకరమని తెలంగాణ వైద్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. భాజపా నాయకులు బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నారనీ, అన్నీ కేంద్రం గుప్పెట్లో పెట్టుకుని రాష్ట్రాలపై నిందారోపణలు చేయడం దారుణమన్నారు.
 
తమకు 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కావాలాని కేంద్రాన్ని అడిగితే కేవలం 306 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశారు. ఇవన్నీ తెలియకుండా తమపై భాజపా నాయకులు బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
 
కరోనా కట్టడికి తాము గట్టి చర్యలు తీసుకుంటున్నామనీ, శుక్రవారం నుంచి జిల్లా డయాగ్రోస్టిక్స్ హబ్స్ ప్రారంభమవుతాయన్నారు. హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నవారికి రక్తపరీక్షలు చేసి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని చూస్తుంటామని చెప్పుకొచ్చారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాకి పెరటివైద్యం, ముక్కులో నిమ్మరసం పిండుకున్నాడు, మృతి చెందాడు