Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పది రోజుల పసికందును రూ.60 వేలకు అమ్మేశారు..

పది రోజుల పసికందును రూ.60 వేలకు అమ్మేశారు..
, బుధవారం, 23 సెప్టెంబరు 2020 (12:55 IST)
పది రోజుల పసికందును రూ.60 వేలకు అమ్మేశారు. వివరాల్లోకి వెళితే.. యాద్రాద్రి భువనగిరి ఏరియా ఆస్పత్రిలో ఈ నెల 12వ తేదీన పసికందుకు జన్మనిచ్చింది ఓ యువతి.. ఆ తర్వాత 10 రోజులకు పసికందును రూ. 60 వేలకు భువనగిరి శివారులోని ఎల్లమ్మ గుడి దగ్గర విక్రయించారు. తెలిసిన వ్యక్తుల ద్వారా ఘట్‌కేసర్‌ మండలం ఎదులబాద్‌కు చెందిన వారికి అమ్మేశారు.
 
అసలు విషయం ఏంటంటే.. పెళ్లి కాకుండానే.. బిడ్డను జన్మనిచ్చింది ఆ యువతి.. తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌ ప్రాంతం నివాసం ఉండే సమయంలో యువతిపై అత్యాచారం జరిగింది. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ ఘటనపై నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం ద్వారానే గర్భం దాల్చిన యువతి పసికందుకు జన్మనివ్వడం ఆ తర్వాత అమ్మేయడం జరిగిపోయాయి. 
 
కానీ, కేసు విచారణలో భాగంగా డీఎన్ఏ పరీక్ష కోసం పాపను తేవాలని కోరారు నేరేడ్‌మెట్ పోలీసులు.. దీంతో.. పాప చనిపోయిందంటూ తప్పుడు సమాచారం ఇచ్చారు. అనుమానం వచ్చిన పోలీసులు.. కాస్త గట్టిగా నిలదీయడంతో పోలీసుల విచారణలో పాపను విక్రయించినట్లు తెలిపారు. ఇక, ఈ ఘటనపై మరో కేసు నమోదు చేసిన పోలీసులు.. పాపను చైల్డ్ కేర్ సెంటర్ తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ స్కామ్‌.. 12చోట్ల ఈడీ సోదాలు