Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిద్రిస్తున్న వారిపై మిద్దె కూలడంతో ఆరుగురు మృతి..

Advertiesment
wall
, ఆదివారం, 10 అక్టోబరు 2021 (09:59 IST)
తెలంగాణ‌లోని జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న వారిపై మిద్దె కూలడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ విషాద ఘ‌ట‌న తెలంగాణ‌లోని జోగులాంబ గ‌ద్వాల జిల్లా అయిజ మండ‌లంలో చోటు చేటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే... కొత్త‌ప‌ల్లి గ్రామంలో మోష, శాంత‌మ్మ దంప‌తులు నివసిస్తున్నారు. వీరికి ఐదుగురు సంతానం. ప్ర‌తిరోజు లాగాగే శ‌నివారం రాత్రి భోజ‌నం అనంత‌రం ఆ కుటుంబం నిద్ర‌పోయింది. అయితే.. ఆదివారం తెల్ల‌వారుజూమున మిద్దె కూలీ వారిపై ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో భార్య భ‌ర్త‌ల‌తో పాటు ముగ్గురు పిల్ల‌లు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.
 
స్పందించిన స్థానికులు క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుంగా.. మ‌రొకరు ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ఒక‌రు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా.. మ‌ట్టి మిద్దె కూలిపోవ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని స్థానికులు చెబుతున్నారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లఖింపూర్‌ ఖేరి: ఆశిష్‌ మిశ్రా అరెస్ట్‌