Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కమలం గూటికి రాములమ్మ?

Advertiesment
Vijayashanti
, మంగళవారం, 27 అక్టోబరు 2020 (17:37 IST)
సొంతగూటికి రాములమ్మ చేరబోతుందా? బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యిందా అంటే అవుననే సమాధానం రాబోతుంది. సోమవారం సాయంత్రం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజయశాంతితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి భేటీ సమారుగా గం. 1.30 నిమిషాలు పాటు సాగింది.
 
సొంత గూటికి రావాలని కిషన్ రెడ్డి ఆహ్వానించినట్టు సమాచారం. వీరిద్దరి భేటీ తరువాత బండి సంజయ్ అరెస్టును విజయశాంతి ఖండించారు. దీంతో విజయశాంతి బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.
 
దుబ్బాక ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా తెలంగాణాలో పార్టీ పుంజుకుంటుదని బీజేపీ నేతలు ఆశ పడుతున్నారు. అధిష్ఠానం అన్ని చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో బలమైన పార్టీగా ఎదిగిన తెరాసను అడ్డుకోవడానికి భారతీయ జనతాపార్టీ అనుకూలమైన అన్ని మార్గాలను వినియోగించుకుంటూ ఆపరేషన్ కమలంకు తెరలేపుతున్నట్టు కనిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాగు భూమిని కబ్జా చేసి టీడీపీ ఆఫీసును నిర్మించారా? సుప్రీంకోర్టు ఏమన్నది?