Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగార్జునసాగర్‌ బీజేపీ అభ్యర్థిగా రాములమ్మ?

Advertiesment
Vijayashanti
నాగార్జునసాగర్‌ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక అభ్యర్థిగా సినీనటి, రాములమ్మ విజయశాంతి పేరును బీజేపీ నాయకత్వం పరిశీలిస్తోంది. ఆమె అభ్యర్థిత్వంపై నల్లగొండ జిల్లా పార్టీ నాయకులు రాష్ట్ర నాయకత్వానికి సూచనలు చేశారు.

సినీగ్లామర్‌తో పాటు కేసీఆర్‌ ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడుతున్న తీరు పార్టీకి కలిసొస్తుందని వారు చెప్పినట్లు తెలిసింది. దీంతో ఈ అంశంపై ప్రత్యేకంగా ఒక అంతర్గత సర్వే నిర్వహిస్తున్నట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి.

గత ఏడాది డిసెంబరు 7న విజయశాంతి తిరిగి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె అభ్యర్థిత్వంపై క్షేత్రస్థాయి నాయకులు, కేడర్‌ రాష్ట్ర పార్టీకి నివేదించడం ఆసక్తికరంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త వీర్యంపై కూడా భార్యకే సర్వహక్కులు : కోల్‌కతా హైకోర్టు తీర్పు