Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెల్ఫీ ఫొటోస్ దిగుతూ నీటిలో పడిన ఇద్దరు యువకులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

సెల్ఫీ ఫొటోస్ దిగుతూ నీటిలో పడిన ఇద్దరు యువకులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
, సోమవారం, 4 అక్టోబరు 2021 (07:46 IST)
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సోదరులిద్దరు సందర్శనకు వెళ్లారు. సెల్ఫీ ఫొటోస్ దిగుతూ ప్రమాదవశాత్తు తమ్ముడు నీటిలో పడిపోగా.. కాపాడేందుకు అన్న దూకాడు. వీరిలో అన్న గల్లంతు కాగా.. తమ్ముడిని పోలీసులు, నీటిపారుదల సిబ్బంది సురక్షితంగా కాపాడారు.

పోలీసులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహ్మద్‌ సోహైల్‌(25), మహ్మద్‌ సైఫ్‌ ఆదివారం సింగూరు ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు మహ్మద్‌ సైఫ్‌ నీటిలోకి జారిపడ్డాడు. తమ్ముడిని రక్షించేందుకు నీళ్లలో దూకిన సోహైల్‌ గల్లంతయ్యాడు.

సైఫ్‌ ఈదుకుంటూ గేట్లవద్దకు చేరుకోవడంతో స్థానికులు, పుల్కల్‌ మండల పోలీసులు, నీటిపారుదలశాఖ సిబ్బంది తాడు సహాయంతో బయటికి లాగారు.

గల్లంతైన సోహైల్‌ ఆచూకీ కోసం మునిపల్లి, పుల్కల్‌ మండలాల పోలీసులు గత ఈతగాళ్లతో గాలించారు. ఆదివారం రాత్రి వరకు ఆచూకీ లభించలేదని మునిపల్లి ఎస్సై మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం మరోసారి గాలింపు చర్యలు చేపడతామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక తప్పుకే ప్రతిపక్షంలో పడ్డాం: రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు