Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏసీ బస్సుల్లో ఇకపై స్నాక్స్-రూ.30లకు మౌత్‌ ప్రెషనర్‌, టిష్యూ పేపర్

Snack Box
, శనివారం, 27 మే 2023 (13:25 IST)
Snack Box
ఏసీ బస్సుల్లో ఇకపై స్నాక్స్ కూడా అందుబాటులో వుంటాయి. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి బస్‌ టికెట్‌ తో పాటే 'స్నాక్‌ బాక్స్‌'ను ఇవ్వాలని నిర్ణయించింది. పైలట్‌ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో తిరిగే 9 ఎలక్ట్రిక్‌ గరుడ బస్సుల్లో స్నాక్‌ బాక్స్‌ విధానాన్ని శనివారం నుంచి ప్రారంభిస్తోంది. 
 
ఇప్పటికే ఏసీ సర్వీసుల్లో వాటర్‌ బాటిల్‌ను ఇస్తున్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగతా సర్వీసులకు ఈ విధానాన్ని విస్తరించనుంది.
 
ఈ స్నాక్‌ బాక్స్‌లో చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చిక్కి ప్యాకెట్లతో పాటు మౌత్‌ ప్రెషనర్‌, టిష్యూ పేపర్ ఉంటాయి. స్నాక్‌ బాక్స్‌ కోసం టికెట్ రేటులోనే రూ.30 నామమాత్రపు ధరను టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దక్షిణ కాశీ పుష్కరిణిలో అభిషేకం.. స్విమ్ చేసిన ఈవో.. నెటిజన్ల ఫైర్