Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫెయిలయ్యామని కొందరు.. తక్కువ మార్కులు వచ్చాయని ఇంకొందరు... ఆత్మహత్యలు

Advertiesment
suicide
, బుధవారం, 10 మే 2023 (09:20 IST)
తెలంగాణ రాష్ట్రంలో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల ఆ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో కొందరు విద్యార్థులు ఫెయిల్ కాగా, మరికొందరు విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయి. ఇలాంటి వారిలో కొందరు తీవ్ర మనస్తాపానికిలోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా ఇప్పటివరకు ఎనిమిది మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని తన తల్లిదండ్రులకు కడపుకోత మిగిల్చారు. 
 
పటాన్‌చెరులో ఇంటర్ ఎంపీసీ చదువుతునున్న తిరుపతికి చెందిన విద్యార్థి ఫెయిల్ అవుతామన్న మనస్తాపంతో సోమవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. మంగళవారం ఉదయం గుండ్లపోచంపల్లి - మేడ్చల్ రైల్వే స్టేషన్‌ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ నగరంలో చదువుకుంటున్న గద్వాలకు చెందిన ఓ విద్యార్థి ఇంటర్ మొదటి సంవత్సరంలో ఓ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో ఉరేసుకున్నాడు. హైదరాబాద్ నగరంలో ఉంటూ ఇంటర్ చదువుతున్న ప్రకాశం జిల్లా విద్యార్థిని ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. 
 
సికింద్రాబాద్‌లో ఒకరు, ఖైరతాబాద్‌లో మరొకరు ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకోగా, నారాయణపేట జిల్లా కొత్తకోటకు చెందిన అమ్మాయికి మార్కులు తక్కువగా వచ్చాయన్న మనస్తాపంతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. అలాగే, పటాన్‌చెరు సమీపంలోని పాటి గ్రామానికి చెందిన భవానీ అనే మరో విద్యార్థిని ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్ అయి తీవ్ర మనస్తాపంతో కనిపించకుండా పోయింది. 
 
జగిత్యాలలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్న ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ బైపీసీ చదువుతున్న ఆర్మూర్ విద్యార్థి కూడా మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. బరిలో 2615 మంది అభ్యర్థులు