Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో తెరుచుకోనున్న పాఠశాలలు... సీఎం కేసీఆర్ ఆదేశాలు

తెలంగాణాలో తెరుచుకోనున్న పాఠశాలలు... సీఎం కేసీఆర్ ఆదేశాలు
, మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (15:25 IST)
కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూతపడివున్నాయి. అయితే అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా అన్ని రంగాలు కూడా ఒక్కొక్కటిగా తెరుచుకుంటుండగా, తెలంగాణలో విద్యా సంస్థలు కూడా పై తరగతి విద్యార్థులకు మాత్రమే అనుమతిస్తూ తరగతులను ప్రారంభించారు. 
 
తాజాగా కేసీఆర్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి 6,7, 8 తరగతులు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ తరగతులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి మార్చి ఒకటో తేదీలోపు తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. 
 
అలాగే పాఠశాలల్లో కోవిడ్‌ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని సూచించారు. అయితే పాఠశాలలు తెరుచుకుంటుండటంతో విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
 
అలాగే పాఠశాల తరగతి గదుల్లో ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తుండాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అధ్యాపకులు, విద్యార్థులు తప్పకుండా మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు.
 
ఈ మధ్యనే 9,10, ఆపై తరగతుల వారికి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, వారికి మాత్రమే తరగతులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు 6,7,8 తరగతులను ప్రారంభించాలని కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. మరీ మిగత కింది తరగతులను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో ప్రమాదం.. ప్రభుత్వ విప్ భవనం పైకప్పు కూలిపోయింది