Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణలో కరోనా- 24 గంటల్లో కొత్తగా 2,009 కేసులు.. దేశంలోనూ కోవిడ్ ఉధృతి

తెలంగాణలో కరోనా- 24 గంటల్లో కొత్తగా 2,009 కేసులు.. దేశంలోనూ కోవిడ్ ఉధృతి
, శుక్రవారం, 2 అక్టోబరు 2020 (09:55 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,009 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 293 నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,95,609 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ 10 మంది మృతి చెందగా మొత్తం మరణించిన వారి సంఖ్య 1145కు చేరింది.
 
ఇవాళ 2437 మంది చికిత్సకు కోలుకొని ఇళ్లకు వెళ్లగా మొత్తం 1,65,844 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 28,320 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా..హోం ఐసోలేషన్‌లో 23,372 మంది ఉన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.58 శాతంగా ఉండగా రికవరీ రేటు 84.78గా ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 54,098 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా మొత్తం 31,04,542 టెస్టులు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
 
మరోవైపు... దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 81,484 మందికి వైరస్ సంక్రమించింది. దీంతో దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 63,94,069కి చేరుకున్నది. గత 24 గంటల్లో కొత్తగా 1095 మంది మరణించారు. వైరస్ సోకిన వారిలో 9,42,217 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 53,52,078 మంది కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 99,773కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైట్ హౌస్‌లో కరోనా కలకలం.. హోప్ హిక్స్‌కు .. హోం క్వారంటైన్‌లో?