Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధనిక రాష్ట్రం ఖజానా ఖాళీ... తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్!

దేశంలో రెండో ధనిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి అలాంటి ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడానికి వీల్లేదు. కానీ, ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బ

Advertiesment
ధనిక రాష్ట్రం ఖజానా ఖాళీ... తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్!
, ఆదివారం, 23 అక్టోబరు 2016 (10:56 IST)
దేశంలో రెండో ధనిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి అలాంటి ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడానికి వీల్లేదు. కానీ, ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. దీనికి కారణం ఆ రాష్ట్ర ఖజానాలో పైసా లేదట. అందుకే చెక్కులను బౌన్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు చెల్లలేదని మీడియా కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలు ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చేవిలా ఉన్నాయి. దీనిపై వివరణ ఇస్తూ, కొత్త జిల్లాలు ఏర్పడిన వేళ, చెక్కులను చెల్లించకుండా తాత్కాలికంగా నిలిపివేశామే తప్ప, అవి చెల్లలేదనడం భావ్యం కాదని ఆ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. 
 
తెలంగాణ డబ్బున్న రాష్ట్రమని చెప్పుకునే కేసీఆర్, చెక్కులు బౌన్స్ కావడంపై ఏమంటారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మల్లన్న సాగర్ ప్రాంతం నేత బెల్లయ్య నాయక్ ప్రశ్నించారు. ఓ వైపు వివిధ పథకాలకు నిధులను ఆపవద్దని కేసీఆర్ చెబుతున్న వేళ, చెక్కు బౌన్సుల వ్యవహారం తెరపైకి రావడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డేటింగ్‌.. డేటింగ్... డేటింగ్... ఆన్‌లైన్‌ డేటింగ్ వలలో భారత యువత