Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సింగరేణి రామగుండం ఘోర ప్రమాదం: నలుగురు మృతి

సింగరేణి రామగుండం ఘోర ప్రమాదం: నలుగురు మృతి
, సోమవారం, 7 మార్చి 2022 (17:53 IST)
Singareni
సింగరేణి రామగుండం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం సింగరేణి ఆండియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో బొగ్గుగని పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. 
 
ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో మ‌రో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్నట్లు స‌మాచారం. మృతుల్లో అసిస్టెంట్ మేనేజర్ కూడా ఉన్నారు. మృతుల‌ను మేనేజ‌ర్ న‌రేశ్‌తో పాటు మ‌రో ముగ్గురిని కార్మికులుగా గుర్తించారు.
 
ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సింగ‌రేణి ఆండ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్టులో సోమ‌వారం మ‌ధ్యాహ్నం బొగ్గు గ‌ని కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స‌హాయ‌క చర్యలు చేప‌ట్టారు. మృతదేహాల‌ను వెలికితీశారు. క్షతగాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి త‌ర‌లించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినిమా టిక్కెట్ల ధరలపై త్వరలో ఏపీ సర్కారు కీలక ప్రకటన