Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాదులో రూ.5లకే రుచికరమైన, నాణ్యమైన భోజనం.. ఎవరికంటే?

Harish Rao
, బుధవారం, 20 ఏప్రియల్ 2022 (15:59 IST)
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర రోగుల సహాయకుల కోసం 5రూపాయలకే రుచికరమైన, నాణ్యమైన భోజనాన్ని మూడు పూటలా అందించేందుకు తగిన కార్యాచరణను రూపొందించింది. 
 
దీంతో పేద, మధ్యతరగతి రోగుల గురించి ఆలోచించిన ప్రభుత్వం 25రూపాయల ఖర్చు అయ్యే భోజనం ఖరీదులో 19.25 రూపాయల రాయితీని ప్రభుత్వం భరిస్తోంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా 38.66కోట్ల అదనపు భారం పడనుంది. 
 
ఆర్ధికంగా వెనుకబడిన, పేదల సౌకర్యం గురించి ఆలోచించిన ప్రభుత్వం ఈ తరహా సదుపాయం కోసం హరే కృష్ణ మూవ్‌మెంట్ స్వచ్చంద సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. పది రోజుల్లో ఈ ఐదు రూపాయల భోజనం సదుపాయం అందుబాటులోకి రానుంది.
 
ఇందులో భాగంగా తొలివిడతగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 ప్రధాన ఆసుపత్రుల దగ్గర ఈసౌకర్యం అందుబాటులోకి తెస్తోంది. రోజుకు 55,800 భోజనాలను రోగుల సహాయకులకు అందించేందుకు అంతా సిద్ధం చేసింది . దీని ద్వారా రోజుకు 18,600మందికి లబ్ది చేకూరనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇది పవిత్రస్థలం.. ఇక్కడ రాజకీయాలు మాట్లాడను : చంద్రబాబు