Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కేటీఆర్‌కు సంబంధం : రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఇటీవల వెలుగుచూసిన డ్రగ్స్ మాఫియాపై ఈడీతో విచారణ జరిపించాలని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విష‌యంపైనే తాను ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండానే సభను వాయిదా

Advertiesment
Revanth Reddy
, శుక్రవారం, 27 అక్టోబరు 2017 (15:30 IST)
తెలంగాణలో ఇటీవల వెలుగుచూసిన డ్రగ్స్ మాఫియాపై ఈడీతో విచారణ జరిపించాలని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విష‌యంపైనే తాను ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండానే సభను వాయిదా వేశారని ఆయ‌న ఆరోపించారు. ఈ రోజు అసెంబ్లీ ప్రాంగ‌ణంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ‌ మంత్రి కేటీఆర్‌కు డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందని తాను భావిస్తున్న‌ట్లు చెప్పారు. 
 
కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు డ్రగ్స్ కేసుతో సంబంధాలున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాను అన్ని ఆధారాలతోనే ఈ ఆరోపణలు చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ‌లో డ్రగ్స్ విషయంపై తాను ఇప్ప‌టికే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. 
 
తెలంగాణలో ఇటీవల వెలుగుచూసిన డ్రగ్స్ మాఫియాపై ఈడీ విచారణ జరిపించాలన్నారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు డ్రగ్స్ కేసుతో సంబంధాలున్నాయని, ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నా... దమ్ముంటే నాపై కేసు పెట్టండి అని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. చిన్న పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోబోకు పౌరసత్వం ఇచ్చిన సౌదీ అరేబియా: రోబోతో ఇంటర్వ్యూ (వీడియో)