Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Advertiesment
ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
, గురువారం, 9 డిశెంబరు 2021 (20:31 IST)
నందిగామ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. నందిగామ మండలం జంగోనిగూడ గ్రామానికి చెందిన శ్రీధర్ (55), పఠాన్ చెరువు మున్సిపాలిటీకి చెందిన సురేష్ కుమార్ (30)లు ఈ ప్రమాదంలో మృతి చెందారు. 
 
వీరిద్దరూ స్థానికంగా ఓ పరిశ్రమలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై కొత్తూరు వెళ్లి తిరిగి వస్తున్నారు. 
 
వీళ్లు అయ్యప్పటెంపుల్ సమీపంలోకి వచ్చేసరికి.. షాద్ నగర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక లారీ అతివేగంగా వచ్చి రోడ్డు పక్కనే ఉన్న వేప చెట్టుకు ఢీకొని, ఆ పక్కనే బైకుపై ఉన్న శ్రీధర్, సురేష్ కుమార్‌లను కూడా ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్ ద్వారా సాక్షులకు సమన్లు ​​ఇస్తారా? పోలీసుల‌కు కోర్టు అక్షింత‌లు