Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా దేవుడు జగన్ పై పిచ్చి వ్యాఖ్యలు చేస్తే, నాలుకలు చీరేస్తాం...

మా దేవుడు జగన్ పై పిచ్చి వ్యాఖ్యలు చేస్తే,  నాలుకలు చీరేస్తాం...
విజ‌య‌వాడ‌ , బుధవారం, 20 అక్టోబరు 2021 (12:49 IST)
టీడీపీ నాయ‌కుడు పట్టాభి వ్యాఖ్యలను ఖండిస్తూ, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నందిగామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీ చేపట్టాయి. డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అయినా వారు ఆగ‌క‌పోవ‌డంతో బారికేడ్లు అడ్డం పెట్టి నిరసన ర్యాలీని అడ్డుకున్నారు. దీనితో కాసేపు ఉద్రిక్త‌త నెల‌కొంది.
 
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మరొకసారి వ్యక్తిగతంగా దూషిస్తే, తీవ్ర పరిణామాలు ఉంటాయని ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ హెచ్చ‌రించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిక్కుమాలిన ఆలోచనలు మాని, బుద్ధి తెచ్చుకోవాలని ఆయ‌న హితవు పలికారు. మా దేవుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై పిచ్చి వ్యాఖ్యలు చేస్తే,  టిడిపి నాయకుల నాలుకలు చీరేస్తామని హెచ్చరించారు. ఇక‌పై టీడీపీ నేత‌లు మాట్లాడే ముందు ఒళ్ళు జాగ్ర‌త్త పెట్టుకోవాల‌ని, విమ‌ర్శ అయితే ఫ‌ర‌వాలేద‌ని... వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు ఏమిట‌ని అరుణ్ కుమార్ ప్ర‌శ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెరువులో పడిన బస్సు : స్కూలు విద్యార్థిని మృతి