Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముసద్దీన్ లాల్ జ్యుయలరీ 370 కిలోల బంగారం లెక్కేంటి? పారిపోయిన ఓనర్ గుప్తా

నవంబరు 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అది కూడా రాత్రి 8 గంటలకు. విశేషం ఏమిటంటే... అదే రోజు రాత్రి హైదరాబాదులోని ముసద్దీన్ లాల్ జ్యుయలరీ ఏకంగా 370 కిలోల బంగారాన్ని అమ్మేసిందట. తన షాపుకు 5200 మంద

Advertiesment
Musaddinlal jewellary
, శనివారం, 24 డిశెంబరు 2016 (20:46 IST)
నవంబరు 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అది కూడా రాత్రి 8 గంటలకు. విశేషం ఏమిటంటే... అదే రోజు రాత్రి హైదరాబాదులోని ముసద్దీన్ లాల్ జ్యుయలరీ ఏకంగా 370 కిలోల బంగారాన్ని అమ్మేసిందట. తన షాపుకు 5200 మంది వచ్చి బంగారం కొనుక్కుని వెళ్లిపోయారట. మొత్తం 370 కిలలో బంగారం, వజ్రాలు అమ్ముడు పోయినట్లు లెక్కలు చూపించారు. ఐతే ఇవన్నీ గాలి లెక్కలని అధికారులు తేల్చారు. 
 
అసలు ఆ రోజు జరిగిన వ్యాపారం ఎంతో చూపించే సీసీ ఫుటేజ్ పరిశీలించాలని ఆ వీడియో టేపులను ఇవ్వమంటే అవి కూడా మార్చేసినట్లు తెలిసింది. ఆ రోజు సీసీ కెమేరాలను ఆపేసినట్లు కనుగొన్నారు. దీనితో ఆ షాపుకు ఎదురుగా ఉన్న షాపు సీసీ ఫుటేజ్ లను పరిశీలించి ముసద్దీన్ లాల్ నగల దుకాణం చేసిన గోల్‌మాల్ ఏంటో విప్పాలని అధికారులు సమాయత్తమయ్యారు. మరోవైపు షాపు యజమాని గుప్తా, ఆయన కుమారుడు పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియోకు వంతపాడుతున్న ట్రాయ్.. నష్టానికి నష్టం.. నెట్‌వర్క్‌కు దెబ్బ: ఎయిర్‌టెల్