Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పదినిమిషాల కార్యక్రమంలో మంత్రి కేటీఆర్

పదినిమిషాల కార్యక్రమంలో మంత్రి కేటీఆర్
, ఆదివారం, 24 మే 2020 (23:19 IST)
సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు పురపాలక శాఖ చేపట్టిన 'ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమము'లో ఈరోజు మంత్రి కేటీ రామారావు తన ఇంటిలో భాగస్వాములయ్యారు.

ఇందులో భాగంగా ఇంటితోపాటు, ఇంటి పరిసరాల్లో పేరుకుపోయిన నీటి పరిశీలన తో పాటు, పూల కుండిలతో పాటు, వివిధ పాత్రల్లో నిండిన నీటిని శుభ్రపరచారు.

దీంతోపాటు ప్రగతిభవన్లో ని గార్డెన్ వంటి ఏరియాల్లో ఎక్కడైనా వాననీరు పేరుకుపోయినడెమనని పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిరంతరం  పది వారాల పాటు కొనసాగించాలని మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు.

ప్రతివారం కేవలం పది నిమిషాల పాటు ఇంటి శుభ్రత కోసం సమయం కేటాయిస్తే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి సీజనల్ వ్యాధులను అరికట్టడానికి వీలవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సీజనల్ వ్యాధుల ను అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా కలిసి రావాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కోరారు.

పురపాలక శాఖ చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క పౌరుడు వారానికి పది నిమిషాలపాటు ఆదివారం రోజు కేటాయించి పరిసరాల పరిశుభ్రత పైన ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబుతో క్షమాపణ చెప్పించండి: మంత్రి ఆదిమూలపు సురేష్