Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మతిస్థిమితం లేని యువతిపై గ్యాంగ్ రేప్ చేసి.. సెల్‌లో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్ట్

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. మతిస్థిమితంలేని యువతిపై గ్యాంగ్ రేప్ చేస్తూ... దాన్ని మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి.. ఆపై సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వికృత చర్య ఒకటి వెలుగులోకి

మతిస్థిమితం లేని యువతిపై గ్యాంగ్ రేప్ చేసి.. సెల్‌లో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్ట్
, శనివారం, 7 జనవరి 2017 (13:21 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. మతిస్థిమితంలేని యువతిపై గ్యాంగ్ రేప్ చేస్తూ... దాన్ని మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి.. ఆపై సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వికృత చర్య ఒకటి వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలం రావుపేట గ్రామంలో డిసెంబర్ 31వ తేదీ ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రావుపేట గ్రామంలో మతిస్థిమితంలేని యువతిని ఆమె తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో అదేగ్రామానికి చెందిన రాజయ్య అనే 57 సంవత్సరాల వ్యక్తి, ఆయనతోపాటు 20 ఏళ్ల వయసున్న లక్ష్మణ్, రాకేష్‌లు అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా సెల్‌లో చిత్రీకరించి ఆ విజువల్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 31నుంచి 5వ తేదీ వరకు వాట్సాప్‌, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియాలో వీడియో ప్లే అయింది.
 
చివరికి వీడియో కరీంనగర్ పోలీసులకు చేరడంతో వారు కేసును సుమోటోగా తీసుకున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు సైతం ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేని నిస్సహాయ స్థితి. తమ కుమార్తె పరిస్థితి చూసి లోలోపలే కుమిలిపోవడం తప్ప బయటకు చెప్పుకోలేని పరిస్థితి కావడంతో పోలీసులు చొరవచూపారు. ప్రస్తుతం పోలీసులు రాజయ్య, రాకేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మణ్ కోసం గాలిస్తున్నారు. ఈ ముగ్గురిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ఎన్నారై లేడీ వలపన్నిందంటే... పని పూర్తయ్యేదాకా వదిలిపెట్టదు.. రాజస్థాన్‌లో సెక్స్ రాకెట్