Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కింగ్ కోఠిలో అగ్నిప్రమాదం.. సెక్యూరిటీ గార్డు సజీవ దహనం

fire
, శనివారం, 25 మార్చి 2023 (18:46 IST)
హైదరాబాద్‌లోని కింగ్ కోఠిలో అర్థరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యారు. ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొగ్గులకుంటలో ఉన్న వినాయక్ మెకానిక్ షెడ్డులో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. 
 
ఈ క్రమంలో వినాయక్ మెకానిక్ షెడ్డులో వ్యాపించిన మంటల్లో నిద్రిస్తున్న కారులో వున్న సెక్యూరిటీ గార్డు సజీవ దహనం అయ్యారు. పలువురు గాయాల పాలైనారు. ఈ ప్రమాదంలో మూడు కార్లు పూర్తిగా, నాలుగు కార్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి. 
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను ఆర్పేశారు. కింగ్ కోఠి కామినేని హాస్పిటల్ సిబ్బంది సమాచారం మేరకు ఇక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రేకప్ అయిన ప్రేమికులకు కౌన్సెలింగ్.. రూ.33 కోట్లు కేటాయింపు