Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మను కలిసిన అమృత, 15 నిమిషాల పాటు గోప్యంగా, ఏం మాట్లాడుకున్నారో?

Advertiesment
Maruthi rao
, శనివారం, 14 మార్చి 2020 (20:48 IST)
ఈరోజు శనివారం సాయంత్రం ఐదున్నర, ఆరు గంటలకు పోలీస్ బందోబస్తు మధ్య తల్లి గిరిజను, మారుతీరావు కూతురు అమృత కలిసింది. బాబాయ్ శ్రవణ్‌తో పాటు మిగతా బంధువులను పోలీసులు పైఅంతస్తులోకి పంపించారు.
 
అమృత తన తల్లి గిరిజతో 15 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఐతే భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో వున్న తల్లిని పరామర్శించేందుకే అమృత వచ్చినట్లు సమాచారం.

మీడియాకు సమాచారం తెలియకూడదని కుటుంబ సభ్యులు, పోలీసులు గోప్యత పాటించారు. ఐతే ఆమె ఏ విషయాలు మాట్లాడారన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు మారుతీరావు తన పేరుపై వున్న రూ. 200 కోట్ల ఆస్తులను తన భార్యకు, సోదరుడికి రాసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియురాలితో రసపట్టులో ప్రియుడు, పదేపదే ఫోన్లు రావడంతో విసిగిపోయి...