Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణలో మరో నవీన్ హత్య కేసు రిపీట్.. ప్రేయసితో క్లోజ్‌గా వున్నాడని.?

murder
, శుక్రవారం, 21 జులై 2023 (13:09 IST)
తెలంగాణలో మరో నవీన్ హత్య కేసు రిపీట్ అయ్యింది. ప్రేమకు అడ్డుగా వున్న స్నేహితుడిని హతమార్చిన ఘటన మరవకముందే.. ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ప్రేయసితో చనువుగా వుండటాన్ని సహించలేక స్నేహితుడిని మద్యం సేవించి బీర్ బాటిల్‌తో పొడిచి చంపిన ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. 
 
20 ఏళ్ల రాజ్ కపిల్ సాహు బీహార్ నుంచి రెండేళ్ల క్రితం తెలంగాణలో సెటిల్ అయ్యారు. 21 ఏళ్ల రాహుల్ కూడా బీహార్ నుంచే వచ్చి తెలంగాణలో వలస వచ్చాడు. ఈ ఇద్దరు స్నేహితులు ఒకే యువతిని ప్రేమించారు. అయితే ఆ యువతి కపిల్‌తో ప్రేమలో పడింది. దీన్ని రాహుల్ సింగ్ తట్టుకోలేకపోయాడు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం కపిల్‌ను రప్పించి ఇద్దరూ మద్యం సేవించారు. ఆ సమయంలో రాహుల్ స్నేహితులు కూడా వున్నారు.
 
అనంతరం బీరు సీసాలు పగలగొట్టి వాటితో పొడిచారు. రాయితో తలపై కొట్టాడు. దీంతో రాజ్ కపిల్ సాహు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం బయటికి వచ్చింది. రాహుల్ వద్ద జరిపిన విచారణలో తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. అతనితో పాటు ఈ హత్యకు పాల్పడిన ఇతర నిందితులను కూడా అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాకింగ్ చేస్తుండగా గుండెపోటు- 28 ఏళ్ల యువకుడి మృతి