Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో ప్రారంభమైన లాక్డౌన్.. యథావిధిగా బ్యాంకు సేవలు

తెలంగాణాలో ప్రారంభమైన లాక్డౌన్.. యథావిధిగా బ్యాంకు సేవలు
, బుధవారం, 12 మే 2021 (11:06 IST)
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ ప్రారంభమైంది. గ‌త లాక్డౌన్ స‌మ‌యంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు య‌థావిధిగా ప‌ని చేస్తాయ‌ని తెలంగాణ కేబినెట్ స్ప‌ష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి అని తెలిపింది. 
 
లాక్డౌన్ నుంచి ప్రింట్ అండ్ ఎల‌క్ట్రానిక్ మీడియాకు మిన‌హాయింపు ఇచ్చింది. వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.
 
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యథావిధిగా సాగుతుంది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యథావిధిగా పనిచేస్తాయి. జాతీయ రహదారుల మీద రవాణా యథావిధిగా కొనసాగుతుంది. జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి. కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
 
మరోవైపు, క‌రోనా ఉధృతి దృష్ట్యా  అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి ఇస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది.
 
తెలంగాణ చుట్టూ.. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న‌ది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది అని స్ప‌ష్టం చేసింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి. 
 
కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా యథావిధిగా కొనసాగుతుంది. సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు మూసి వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. పైన తెలిపిన మినహాయింపులను పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలను అనుసరించి కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని క్యాబినెట్ ఆదేశించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. తప్పుడు లెక్కలంటున్న అమెరికా