Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో లాక్డౌన్.. బయటికొస్తే వాతలే.. అనుమతించేవి ఇవే...

తెలంగాణాలో లాక్డౌన్.. బయటికొస్తే వాతలే.. అనుమతించేవి ఇవే...
, మంగళవారం, 11 మే 2021 (20:15 IST)
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం ఉంటుందని పేర్కొంది. లాక్డౌన్‌ కొనసాగింపుపై ఈనెల 20న కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. 
 
అయితే, ప్రభుత్వ కార్యాలయాలు 33 శాతం సిబ్బందితో నడవనున్నాయి. లాక్డౌన్‌ నుంచి వ్యవసాయరంగానికి మినహాయింపునిచ్చారు. రాష్ట్రంలో యథావిధిగా ధాన్యం కొనుగోళ్లు, ఉపాధి హామీ పనులు కొనసాగనున్నాయి. లాక్డౌన్‌ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో ఎవరైనా బయటకు వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. 
 
లాక్డౌన్ నుంచి మినహాయింపు కల్పించిన రంగాలు:
* వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్డౌన్ వర్తించదు.
 
* తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని కేబినెట్‌ నిర్ణయించింది.
 
* వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.
 
* విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి. జాతీయ రహదారుల మీద రవాణా యధావిధిగా కొనసాగుతుంది. జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి.
 
* కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు. ఉపాధిహామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి. ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి.
 
* గత లాక్డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి. అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి. అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి.
 
* తెలంగాణ చుట్టూ రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి.
 
* సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు మూసి వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. పైన తెలిపిన మినహాయింపులను పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలను అనుసరించి కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని కేబినెట్‌ ఆదేశించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా నుంచి రక్షణ కోసం డబుల్ మాస్కులు మంచిదే, ఎలాంటి మాస్కులు వాడాలి?