Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మేమే.. నేనే సీఎం: షర్మిల

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మేమే.. నేనే సీఎం: షర్మిల
, శుక్రవారం, 26 మార్చి 2021 (06:44 IST)
తెలంగాణలో వైఎస్ షర్మిల తన పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. పది ఉమ్మడి జిల్లాల ముఖ్యనేతలతో గురువారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో నిర్వహించే సంకల్ప సభ వాల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. 
 
కాగా లక్ష మందితో సభ నిర్వహణకు షర్మిల బందం ఒకవైపు కసరత్తు చేస్తుంటే.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేవలం 6వేల మందితో సభ నిర్వహించుకునేందుకు ఖమ్మంజిల్లా పోలీసులు అనుమతి ఇచ్చారు. అది కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటలలోపే సభ నిర్వహించుకోవాలని సూచించారు.
 
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేననీ, తానే సీఎంనని ప్రకటించారు. తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదన్నారు. టీఆర్‌ఎస్‌ చెబితేనో, బీజేపీ అడిగితేనో వచ్చినవాళ్లం కాదని అన్నారు. వైఎస్‌ మహా ప్రస్థానం పాదయాత్ర మొదలుపెట్టిన ఏప్రిల్‌ 9న తొలి అడుగు వేద్దామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దంచి కొడుతున్న ఎండలు.. రాగల మూడు రోజుల్లో..?