Publish Date: Mon, 04 Jan 2021 (14:22 IST)
Updated Date: Mon, 04 Jan 2021 (14:35 IST)
తాళికట్టిన భార్యను పక్కనబెట్టి.. వేరొక మహిళతో రాసలీలలు నడుపుతున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. పక్కా ప్లాన్ ప్రకారం భర్త గుట్టును ఆతని భార్య బయటపెట్టింది. తనను మోసం చేసి వ్యక్తిపై బంధువులతో కలిసి దాడికి దిగింది. అతనికి దేహశుద్ది చేసింది. ఈ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం పట్టణానికి చెందిన శీనుకు, కోర్టు కాలనీకి చెందిన కవితతో 20 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ప్రస్తుతం శీను ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అయితే శీను, కవితల మధ్య కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. మరోవైపు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న శీను.. ఖమ్మం పట్టణలోని గట్టయ్య సెంటర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు.
ఆ ఇంట్లో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసి ఉంటున్నాడు. భార్యకు ఏదో ఒక్క కారణం చెప్పి వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ వద్దకు వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. అంతే భర్త ప్రవర్తనపై కవితకు అనుమానం రావడంతో పాటు బంధువుల సాయంతో రెడ్ హ్యాండెడ్గా భర్తను పట్టుకుంది. అలాగే భర్తతో పాటు వున్న మహిళను ఖమ్మం పోలీసులకు అప్పగించారు.
సెల్వి
Publish Date: Mon, 04 Jan 2021 (14:22 IST)
Updated Date: Mon, 04 Jan 2021 (14:35 IST)