Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజుకో నిరుద్యోగి హత్యతో కేసీఆర్ రాక్షసానందం: షర్మిల ఫైర్

Advertiesment
KCR
, శుక్రవారం, 13 ఆగస్టు 2021 (17:30 IST)
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా 26 ఏళ్ల‌ నరేశ్‌‌ను హత్య చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో నిరుద్యోగి హత్యతో రాక్షసానందం పొందుతున్నారు. రాతిగుండె కేసీఆర్ ఇంకెంత మందిని పొట్టనపెట్టుకుంటారు? ఇంకెంత మంది చనిపోతే నోటిఫికేషన్లు విడుదల చేస్తారు? ఇప్పటికే వంద‌ల‌ మంది నిరుద్యోగులు చనిపోయారు' అని ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు.
 
'ఇంకెంతమంది తల్లులు చేతికందిన కొడుకులను కోల్పోయి గర్భశోకం అనుభవిస్తే మీ కండ్లు చల్లబడుతాయి? ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేయడానికేనా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది? వెంటనే రాజీనామా చేసి.. ముక్కు నేలకి రాసి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి నువ్వు ఇంకా మనిషివే అని నిరూపించుకో కేసీఆర్' అని ష‌ర్మిల పేర్కొన్నారు.
 
ఉపాధ్యాయ ఉద్యోగాల‌ కోత పెడుతున్నార‌ని, ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో వైద్యం స‌రిగ్గా అంద‌ట్లేద‌ని కేసీఆర్ పై ష‌ర్మిల విమ‌ర్శించారు. 'టీచర్ ఉద్యోగాల కోతతో ఉరితాడు పెనుతున్నవ్. మీ 7 ఏండ్ల పాలనలో.. సర్కార్ విద్యను .. సర్కార్ వైద్యాన్ని భ్రష్టు పట్టించినవ్.. సర్కార్ బడులను సక్కగా చేసుడు చేతకానప్పుడు..  ఉద్యోగాలు కల్పించడం చేతకానప్పుడు..  పరిపాలన చేయడం చేతకానప్పుడు ..  మీకు ముఖ్యమంత్రి పదవి కూడా దండుగ కేసీఆర్' అని ఆమె విమ‌ర్శించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మమ్మల్ని కూడా చంపేస్తారు.. ప్రాణాలు కాపాడండి.. : వివేకా కుమార్తె లేఖ