Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ లిక్కర్ కేసు.. ఈడీ ముందు మార్చి 11న హాజరవుతా.. కవిత లేఖ

kavitha
, గురువారం, 9 మార్చి 2023 (09:16 IST)
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తాను ఏజెన్సీ సమన్లకు కట్టుబడి మార్చి 11న తమ ముందు హాజరవుతానని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు కె. కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి లేఖ రాశారు. మార్చి 9న హాజరు కావాల్సిందిగా కోరుతూ ఈడీ నోటీసు జారీ చేయడంతో కవిత స్పందించారు, మొదట్లో ఆమె ఒక వారం ఆలస్యం చేయాలని కోరారు. 
 
అయితే, ఈడీ కవిత అభ్యర్థనను తిరస్కరించింది, చట్టం ప్రకారం తన హక్కులను వినియోగించుకోవాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తూ కవిత మరో లేఖ పంపారు. లేఖలో, ఆమె ఈ కేసులో తన ప్రమేయాన్ని ఖండించారు. ఈడీ నోటీసులు ​​రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. అయినప్పటికీ, ED సూచించిన విధంగా మార్చి 11న ఏజెన్సీ ముందు హాజరు కావడానికి కవిత సుముఖత వ్యక్తం చేశారు.
 
ఈలోగా, కవిత ఢిల్లీకి చేరుకుంటారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంలో పార్లమెంటు జాప్యానికి వ్యతిరేకంగా మార్చి 10 న ఒక రోజు నిరసనకు నాయకత్వం వహించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో మహిళా ఆరోగ్య పథకం: ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదు