Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఇంద్రకరణ్

కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఇంద్రకరణ్
, శుక్రవారం, 6 ఆగస్టు 2021 (17:10 IST)
నిర్మల్ నియోజకవర్గం లక్ష్మణ చందా మండలానికి చెందిన 64 మందికి, మామడ మండలానికి చెందిన 21 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను కనకపూర్ గ్రామంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను ఆపడం లేదని అన్నారు.

పేద కుటుంబాలకు ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక భరోసా కలిపించారని తెలిపారు.. రైతులకు రూ.50 వేల రుణమాఫీ చేయడంతో పాటు 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నగరిలో బస్టాండ్ వసతి సౌకర్యం కోసం రోజా పరిశీలన