Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి రైలు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయింది: పోలీసులు

జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి రైలు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయింది: పోలీసులు
, గురువారం, 20 జనవరి 2022 (10:00 IST)
జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి మృతిపై దర్యాప్తు చేస్తున్న గవర్నమెంట్ రైల్వే పోలీసులు ప్రాధమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. రైలు కంపార్ట్‌మెంట్ మెట్లు- ప్లాట్‌ఫారమ్ మధ్య చిక్కుకోవడం వల్ల జ్యోతిరెడ్డి తీవ్రంగా గాయపడి మరణించిందని అనుమానిస్తున్నారు.

 
కడపకు చెందిన జ్యోతిరెడ్డి (28) అనే యువతి హైదరాబాద్ నగరంలో ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తుంది. సంక్రాంతి పండుగ కోసం సొంతూరు వెళ్లిన జ్యోతి సోమవారం రాత్రి తిరిగి హైదరాబాద్ నగరానికి పయనమైంది. 

 
ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున రైలు షాద్ నగరులో రైల్వే స్టేషన్‌లో ఆగింది. రైలు ఆగడంతో కాచిగూడ వచ్చేశామని భావించిన జ్యోతి రైలు దిగేసింది. అయితే, ఆ తర్వాత అది షాద్‌నగర్‌ అని తెలుసుకుని కంగారుపడింది. 

 
అప్పటికే రైలు కదలదడంతో రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి అదుపుతప్పి కిందపడిపోయింది. తీవ్రంగా గాయపడిన జ్యోతిరెడ్డిని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ విషయం తెలిసిన జూనియర్ ఆర్టిస్టులు జ్యోతి మృతికి రైల్వే నిర్లక్ష్యమే కారణంగా ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలో కోవిడ్ 19 మహమ్మారి థర్డ్ వేవ్ జనవరి 23న గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు... ఆ తర్వాత?