Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిత్తు కాగితాలు ఏరుకునే మహిళనూ వదలని కామాంధులు...

Advertiesment
Janagama
కామాంధుల దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా చిత్తుకాగితాలు ఏరుతున్న మహిళపై అఘాయిత్యం జరిగింది. ఆమెపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. ఈ ఘటన తెలంగాణలో జనగామలో కలకలం సృష్టించింది. 
 
వివరాల్లోకి వెళితే.. చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే ఓ మహిళపై కొందరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమెను హత్య చేశారు. మృతదేహాన్ని మండలంలోని శామీర్‌పేట జాతీయ రహదారి పక్కన కల్వర్టు కింద పడేశారు. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
విచారణలో మృతిచెందిన మహిళకు 14 ఏళ్ల క్రితం వివాహమైందని, ఆమెకు ఓ కుమార్తె కూడా ఉందని.. ప్రస్తుతం ఆమె భర్త మరో మహిళతో హైదరాబాద్‌లో ఉంటున్నట్టు తేలింది. మంగళవారం ఈ ఘోరం జరిగిందని పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవ్యాంధ్రలో 25 జిల్లాలు? జగన్ ప్లాన్... పవన్‌కు ఆహ్వానం