Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హుజురాబాద్ ఉపఎన్నికపై నిఘా: 1900 మంది బలగాలతో బందోబస్తు

హుజురాబాద్ ఉపఎన్నికపై నిఘా: 1900 మంది బలగాలతో బందోబస్తు
, బుధవారం, 13 అక్టోబరు 2021 (11:09 IST)
హుజురాబాద్ ఉపఎన్నికపై నిఘా కట్టుదిట్టం చేసింది. ఏకంగా 1900 మంది బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. అంతే కాదు అతి త్వరలోనే 120 సెక్షన్‌ల కేంద్ర బలగాలు రంగంలోకి దిగనున్నాయి. బ్ల్యు కోట్స్, పెట్రో కారులతో పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టనున్నారు పోలీసులు.
 
అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీసులు. నాలుగు మండలాలలో 406 సిసి కెమెరాలు ఏర్పాటు ఏర్పాటు చేశారు. హుజురాబాద్‌లో 110, జమ్మికుంటలో 169, వీణవంకలో 87, ఇల్లందకుంటలో 36 కెమెరాలు ఏర్పాటు చేశారు.
 
ఇక ఇప్పటి వరకు 12 రోజుల్లో కోటి 27 లక్షల నగదు పట్టుబడినట్లు పోలీసులు పేర్కొన్నారు. మూడు లక్షల విలువైన మద్యం, గంజాయి, జిలేటిన్ స్టిక్స్ డిటోనేటర్లు, 75ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
ఇక ఇప్పటి వరకు ఎన్నికల ఉల్లంఘన ఘటనల్లో 33 కేసులు నమోదు అయ్యాయని పోలీసులు చెప్పారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ కాకుండా 24 గంటలు రెండు సైబర్ క్రైమ్ టీమ్స్ నిఘా పెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాతీయ ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో రజత పతక విజేత వెంక‌ట్రాద్రి