Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నం తింటున్న భార్యను కొట్టిన భర్త, భవనం పైనుంచి దూకేసింది...

Advertiesment
Husband
, బుధవారం, 19 జూన్ 2019 (14:19 IST)
తాగుబోతు భర్త వేధింపులు భరించలేక.. ఏడాది వయస్సున్న కుమార్తెను ఒళ్లో పెట్టుకుని భవనంపై నుంచి దూకేసింది ఓ ఇల్లాలు. మూడు అంతస్తుల బిల్డింగ్ పైనుంచి అమాంతంగా కిందకు దూకడంతో ఏడాది పాప అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తల్లి రెండు కాళ్లు విరిగి.. తల పగిలి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. 
 
అయితే భర్తే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని.. భార్యను, బిడ్డను కడతేర్చేందుకు అతనే భవనంపై నుంచి తోసేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు పరిశీలిస్తే ఛత్తీస్ ఘడ్‌కు చెందిన దామిని, యోగేష్ భార్యభర్తలు. రెండున్నర నెలల క్రితమే హైదరాబాద్ నాచారం మల్లాపూర్‌లో ఓ భవన నిర్మాణ పనులకు కూలీలుగా చేరారు. భర్త యోగేష్ తాపీ పని చేస్తుండగా భార్య దామిని కూలీ పని చేసేది. వీరికి ఏడాది వయస్సున్న పాప విద్య ఉంది. 
 
తాగొచ్చి భర్త యోగేష్ నిత్యం దామినిని శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. బిడ్డ కోసం కష్టాలన్నీ భరించింది ఈ ఇల్లాలు. రోజులాగే రాత్రి యోగేష్ ఫుల్లుగా తాగి ఇంటికొచ్చాడు భోజనం పెట్టమని, భార్య పాపతో కలసి భోజనం చేస్తున్న సందర్భంలో భార్యను అకారణంగా బలంగా  కొట్టాడు. దీంతో భోజనం చేస్తున్న దామిని అన్నం పళ్లాన్ని అక్కడే వదిలేసి బిడ్డను తీసుకుని బిల్డింగ్ పైకి ఎక్కేసింది. బిడ్డను ఒళ్లో పెట్టుకుని మూడంతస్తుల బిల్డింగ్ పైనుంచి కిందకు దూకేసింది. 
 
పెద్ద శబ్దం రావడంతో అక్కడున్న కూలీలు వచ్చి చూడగా.. అప్పటికే ఏడాది పాప విద్య చనిపోగా.. తల్లి దామిని రెండు కాళ్లు విరిగి.. తల పగిలి తీవ్ర గాయాలతో పడి కనిపించింది. అయితే భర్తే భార్యను, బిడ్డను తోసేసి ఉంటాడని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యోగేష్ పైన ఛత్తీస్‌ఘడ్‌లో పలు పోలీసు కేసులు ఉన్నాయని అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చి ఇక్కడ నివాసముంటున్నాడని చెప్తున్నారు తోటి కూలీలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో బాలయ్య బాబు అంటే జనగ్మోహన్ రెడ్డికి అంత ఇష్టమా?