Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కూతురికి రెండో పెళ్లి చేయాలని మనవడిని చంపేసింది.. ఎక్కడ?

కూతురికి రెండో పెళ్లి చేయాలని మనవడిని చంపేసింది.. ఎక్కడ?
, శుక్రవారం, 30 జులై 2021 (22:40 IST)
కూతురికి రెండో పెళ్లి చేసేందుకు మనవడు అడ్డుగా ఉన్నాడని అమ్మమ్మే కిరాతకురాలిగా మారింది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన మనవడిని సొంత అమ్మమ్మే కిరాతకంగా చంపేసింది. సంగారెడ్డిలో అమానుష ఘటన జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. రెండేళ్ల బాలుడి అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. సొంత అమ్మమ్మే చిన్నారిని అమానుషంగా హతమార్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. సంగారెడ్డికి చెందిన యశ్వంత్(2) గురువారం కనిపించకుండా పోయాడు. 
 
కుటుంబ సభ్యులు, స్థానికులు చుట్టుపక్కల గాలించినా ప్రయోజనం లేకపోయింది. అయితే శుక్రవారం అనూహ్యంగా బిబ్బిలకుంట చెరువులో యశ్వంత శవమై తేలాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. తమదైన స్టైల్ లో విచారణ చేశారు. ఈ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
 
చిన్నారి యశ్వంత్ తండ్రి రెండేళ్ల కిందట మరణించాడు. భర్త చనిపోయిన కూతురికి మరో పెళ్లి చేయాలని ఆమె తల్లి భావించింది. అయితే మనవడు ఆమెకు అడ్డుగా కనిపించాడు. అంతే, మరో ఆలోచన చేయకుండా ఏ మాత్రం కనికరం చూపకుండా మనవడిని కిరాతకంగా చంపేసి చెరువులో పడేసింది. 
 
మరొకరి సాయంతో మనవడిని అమ్మమ్మే మట్టుబెట్టింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తన కూతురు భవిష్యత్తు కోసమే తానిలా చేశానని నిందితురాలు చెప్పింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిశా యాప్ మీ వ్యక్తిగత సమాచారం చూడదు: మంత్రి తానేటి వనిత