Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం, స్నేహితులు కూడా

Advertiesment
young men
, శుక్రవారం, 29 మే 2020 (15:11 IST)
నలుగురు కామాంధులు బాలికపై సంవత్సర కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన నల్గోండ జిల్లాలో చోటుచేసుకుంది. బాలిక గర్భందాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తిప్పర్తి మండలంలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. 
 
కోర్కెలు కూడా తీర్చుకునే వాడు, అయితే ఈ విషయం పసిగట్టిన నవీన్ స్నేహితుడు రమేష్ కూడా ఆమెపై ఆశపడ్డాడు. వాళ్ల విషయం పెద్దలకు చెప్పేస్తానని బెదిరించి లోబర్చుకున్నాడు. వీరితో పాటు మరో ఇద్దరు శంకర్, అనిల్‌ కూడా బాలికను బెదిరించి వశం చేసుకున్నారు. నలుగురూ ఏడాది కాలంగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు.
 
బాలికకు అనారోగ్యంగా ఉండటంతో తల్లిదండ్రులు హాస్పిటల్‌కి తీసుకువెళ్లగా ఆమెకు గర్భం అని తేలింది. దానితో వారు బాలికను నిలదీస్తే అసలు విషయం చెప్పింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే నిందితులు అప్పటికే పరారయ్యారు. సోమోరిగూడెంలోని ఎల్లెంల నాగిరెడ్డి రేకుల షెడ్డు దగ్గర నలుగురు వ్యక్తులు ఉన్నారని సమాచారం అందటంతో పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ తీర్పు ప్రజాస్వామినికి ఊపిరి.. పవన్ : న్యాయం - చట్టం గెలిచింది.. కేశినేని