Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భద్రాద్రి కొత్తగూడెం సబ్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం..

భద్రాద్రి కొత్తగూడెం సబ్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం..
, మంగళవారం, 15 జూన్ 2021 (12:30 IST)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాల్వంచ పట్టణ పరిధిలోని సీతారాంపట్నం సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆరుగురు సిబ్బంది సబ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ప్రాణనష్టం సంభవించక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 
మంగళవారం ఉదయం ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. సబ్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు అధికారులు. అగ్ని ప్రమాదం సంభవించడంతో చుట్టుపక్కల మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.. గత సంవత్సరం ఇదే సబ్ స్టేషన్ విద్యుత్ కేబుల్స్ అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు
 
ఇక సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. సబ్ స్టేషన్ అగ్ని ప్రమాదం సంభవించడంతో చుట్టుపక్కల మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ కండక్టర్ వైరు తెగి ట్రాన్స్ఫార్మర్ మీదపడటంతో భారీగా మంటలు చెలరేగాయి. 
 
అగ్ని కీలలు సబ్‌ స్టేషన్‌ మొత్తం విస్తరించడంతో ఇప్పటికే సబ్ స్టేషన్ సగానికిపైగా అగ్నికి ఆహుతైంది.  పాల్వంచ కేటీపీఎస్ నుంచి 3 కొత్తగూడెం నుంచి 1 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కూడా వ్యాపించడంతో అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోర్టు చౌరస్తాలో కల్నల్ సంతోష్ బాబు కాంస్య విగ్రహావిష్కరణ