Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు
, గురువారం, 24 ఫిబ్రవరి 2022 (10:16 IST)
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. తమ పార్టీ పేరును రిజిస్టర్ చేసినట్టుగా తమకు లేఖ అందినట్లు పార్టీ అధ్యక్షుడు వాడుక రాజగోపాల్‌ ప్రకటించారు. తమ పార్టీని రిజిస్టర్ చేయాల్సిందిగా కోరుతూ 28 డిసెంబరు 2020లో ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశామని రాజగోపాల్ తెలిపారు.
 
అటు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు కోసం షర్మిల తల్లి విజయలక్ష్మి నిరభ్యంతర పత్రాన్ని సమర్పించారు. ఈసీ గుర్తించడంతో ఈ నెల 16 నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి రాజకీయ గుర్తింపు లభించినట్టు అయింది. 
 
ప్రస్తుతానికి మాత్రం ఈ పార్టీకి వాడుక రాజగోపాలే అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో త్వరలోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశం ఏర్పాటు చేసి అధ్యక్షురాలిగా షర్మిల పేరును ఆమోదించి ఎన్నికల సంఘానికి పంపనున్నట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యుద్ధం ప్రారంభం, ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవడానికి కాదు: పుతిన్, బైడెన్ కన్నెర్ర