Publish Date: Wed, 08 Nov 2023 (16:47 IST)
Updated Date: Wed, 08 Nov 2023 (16:49 IST)
తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక మార్పులు చేసింది. ఓటు వేయలేని వారికి సహాయకుడిగా వచ్చే వారి.. కుడి చేతి చూపుడు వేలుకు ఇకపై ఇంకు వేస్తారు. సహాయకుడు అదే బూత్కు చెందిన ఓటరై ఉండాలని ఈసీ పేర్కొంది. పోలింగ్ ఏజెంట్లుగా సర్పంచ్, వార్డు సభ్యులు కూర్చోవచ్చని ఈసీ తెలిపింది.
తన ఓటు వేశాకే మరొకరికి సహాయకుడిగా వెళ్లాలని.. అయితే ఓటు వేసేటప్పుడు ఎడమ చేయి చూపుడు వేలుకు ఇంకు వేయాలని ఈసీ సూచించింది. కాగా ఈసారి ఉదయం 5.30 గంటల నుంచే మాక్ పోలింగ్ ప్రారంభిస్తారు.