Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా కొత్త వేరియంట్.. తెలంగాణలో 25 డెల్టాక్రాన్ కేసులు

కరోనా కొత్త వేరియంట్.. తెలంగాణలో 25 డెల్టాక్రాన్ కేసులు
, సోమవారం, 21 మార్చి 2022 (13:28 IST)
కరోనావైరస్ కొత్త వేరియంట్ల ప్రమాదం ఆందోళన కలిగిస్తోంది. భారతదేశంలోని వివిధ ప్రయోగశాలల్లో 568 కోవిడ్ సీక్వెన్‌లు దర్యాప్తులో ఉన్నాయి. 
 
డెల్టాక్రాన్‌గా పిలువబడే ఈ తరహా కేసులు తెలంగాణలో ఇప్పటివరకు 25 నమోదు కాగా, కర్ణాటకలో 221, తమిళనాడులో 90, మహారాష్ట్రలో 66, గుజరాత్లో 33, పశ్చిమ బెంగాల్లో 32, న్యూఢిల్లీలో 20 కేసులు నమోదయ్యాయి. 
 
ఇప్పటికే దేశంలో 568 కోవిడ్ సీక్వెన్స్‌లలో డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల రీకాంబినెంట్ వైరస్ ఉనికిని సూచిస్తుంది, అంటే ఇది డెల్టా, ఒమిక్రాన్ రెండింటి యొక్క జన్యు అంశాలను కలిగి ఉంటుంది.
 
డెల్టా మరియు ఒమిక్రాన్ యొక్క పునఃసంయోగానికి పెరుగుతున్న ఆధారాలను కరోనావైరస్ నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయని సూచిస్తున్నాయి. 
 
అందుచేత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కరోనా మహమ్మారి అంతం కాదని గ్రహించడానికి ఇదే నిదర్శనమని హైదరాబాద్‌లోని ఆరోగ్య అధికారులు నొక్కి చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల.. వెబ్ సైట్ ద్వారా..?