Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా నుంచి కోలుకున్నాడు.. ఆరేళ్ల బాలుడు డిశ్చార్జి..

Advertiesment
కరోనా నుంచి కోలుకున్నాడు.. ఆరేళ్ల బాలుడు డిశ్చార్జి..
, సోమవారం, 4 మే 2020 (22:12 IST)
హైదరాబాదులోని గాంధీ దవాఖానా నుంచి ఆరేళ్ల బాలుడు కరోనా రక్కసి చెర నుంచి బయటపడ్డాడు. సోమవారం అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఢిల్లీ మర్కజ్‌ నుంచి వచ్చిన ఒకరి ద్వారా జైనూర్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా సోకగా, తన నుంచి తన ఆరేళ్ల మనుమడికి అంటుకుంది. 
 
గత నెల 18న పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ రావడంతో హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. బాలుడు కోలుకోవడంతో సోమవారం డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో మగ్గురు కోలుకున్నారు. మరో నలుగురు గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
 
ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. సోమవారం కేవలం కొత్తగా 3 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 1085కు చేరింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. 
 
సోమవారం నమోదైన మూడు కేసులు కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. ఇంకా సోమవారం పూట 40మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఫలితంగా మొత్తం 585 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాశ్మీర్‌లో 300మంది ఉగ్రమూకలు.. ఆగని దాడులు.. జవాన్ల వీరమరణం