Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంత్యక్రియల్లో పాల్గొన్న 19 మదికి కరోనా పాజిటివ్

అంత్యక్రియల్లో పాల్గొన్న 19 మదికి కరోనా పాజిటివ్
, ఆదివారం, 14 జూన్ 2020 (15:30 IST)
కరోనా వైరస్ కారణంగా ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొనాలన్నా భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా అంత్యక్రియల్లో పాల్గొన్న 19 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, జహీరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ మహిళ ఇటీవల ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని బంధువులకు అప్పగించడంతో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, ఈ అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో ఒకరికి కరోనా వైరస్ సోకివుంది. ఈ విషయం తెలియకపోవడంతో ఆ రోగిని పలువురు తాకారు. 
 
ఇలా ఏకంగా 19 మందికి ఈ వైరస్ సోకింది. దీంతో వీరందరినీ ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా, వీరితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. కాగా, చాలా మంది సామాజిక భౌతికదూరం పాటించకపోవడం, ముఖానికి మాస్కులు ధరించక పోవడం వల్లే కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా విశ్వరూపం : నిండుకున్న ఐసీయూ వార్డులు.. రైల్వే కోచ్‌లే దిక్కు!!