Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రిజర్వేషన్ల రద్దుకు కుట్ర: టీపీసీసీ

రిజర్వేషన్ల రద్దుకు కుట్ర: టీపీసీసీ
, మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (11:11 IST)
దేశంలో రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అణగదొక్కేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లపై టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్​ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన మహాధర్నాలో హస్తం నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

భాజపా న్యాయవాదుల బలహీనమైన వాదనల కారణంగానే సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ అన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లపై టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద జరిగిన మహాధర్నాలో హస్తం నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐదేళ్ళ బాలికపై అత్యాచారం.. కామాంధుడుకి 20 యేళ్ల జైలు